10, ఫిబ్రవరి 2011, గురువారం

ఇద్దరు ఇద్దరే రాధాకృష్ణ వర్సెస్ చిరంజీవి

ఈరోజు ఒకరినొకరు ఆటాడుకోవాలని ఆ ఇద్దరు
ఉభాలటపడ్డారు.మెగా డిబేట్ పేరుతో ఆంధ్రజ్యోతి
రాధాకృష్ణ ఈరోజు తన చానల్లో చిరంజీవి తో
ఇంటర్ వ్యూ నిర్వహించారు . కాంగ్రెస్ లో విలీనం
అవుతున్న దశలో చిరుతో ఎన్నో విషయాలు
ప్రస్తావించారు .పార్టి పెట్టిన దగ్గరనుంచి ...నేటి
వరకు జరిగిన పరిణామాలు గురించి రాధాకృష్ణ
గుచ్చి గుచ్చి అడిగారు ...చిరు మాత్రం చాల
ఓపిగ్గా సుమారు రెండు గంటలు సమాధానం
చెప్పారు ..రాధా కృష్ణ ఎన్నో సార్లు ఇబ్బంది పెట్టె
ప్రయత్నాలు చేసినా చిరు చాల తెలివిగా చెప్పడమే
కాదు ....తను కూడా మాటలు తూటాలు పేల్చారు .
కొన్ని విషయాలకు ,విమర్శలకు సమాధానం
చెప్పడానికి మీడియా తమ పార్టి కి అవకాశం
ఇవ్వలేదని ఎదురు దాడికి దిగడం కనిపించింది .
తన పరంగా జరిగిన ప్రతి విషయాన్ని సమర్దించుకున్నారు
చిరు .కాంగ్రెస్ తో చేతులు కలపిన తర్వాత తొలిసారిగా
లైవ్ షో లో పోల్గున్న చిరు రాజకీయంగా రాటుదేలి
ఎవ్వరితో నైన రడి అన్నట్టు కనిపించారు .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి