30, మార్చి 2011, బుధవారం

సచిన్ "వంద " దాటనివ్వలేదుగా!!!!

పాకిస్తాన్ క్రికెటర్ చెప్పినట్టే జరిగింది .సచిన్ ను వంద పరుగులు చేయనివ్వం అని ఆఫ్రిది ముందే చెప్పాడు .అదే జరిగిందితోబ్బై పరుగులు దాటకుండానే పెవిలియన్ కు పంపారు .అప్పటికే రెండు లైఫ్ లు వచ్చాయి.ఏది ఏమైనా పాకిస్తాన్ఆటగాళ్ళ పట్టుదల ను మనం తప్పకుండ అభినందించాలి .సీరియస్ గా ఫీల్డింగ్ చేసి స్కోర్ రెండు వందల్ అరవై కి కంట్రోల్చేసారు .
.

తన హీరో గురించి మరింత తెల్సుకోవడానికే "అభిమాని "

సుమ భర్త రాజీవ్ కనకాల యాంకర్ గా ఈ టి వి లో "అభిమాని " మంగళ వారం నుంచి మొదలయ్యింది .రాజీవ్ ప్రాణ స్నేహితుడు ఎన్ టి ఆర్ తో మొదటి షో ప్రారంబించారు .డిఫరెంట్ గెటప్ లో రాజీవ్ యాంకరింగ్ చేసారు .అయితే మొదట కొన్ని నిమిషాలు తడపడ్డాడు .తర్వాత పరవాలేదని పించింది .(బుల్లి తెర టాప్ యాంకర్ "సుమ " తన భార్యే కాబట్టి కొంత కోచింగ్ తీసుకోవడం మంచిది ).మొత్తం ఎనిమిది రౌండ్ లు గా షో రూపొందించారు .మొదటి ఎపిసోడ్ లో నాలుగు ,రెండవ ఎపిసోడ్ లో మిగతా రౌండ్ లు ఉంటాయి .ఎన్ టి ఆర్ తో జరిగిన షో తీరు చూస్తే ..తన" అభిమాన తార" గురించి ఎక్కువగా తెల్సు కోవడానికి వీలుగా ఉంది .వ్యక్తి గత విషయాలు ,అభిరుచులు ....ఆలోచనలు .....వంటివి ప్రశ్నల ద్వారా అభిమానులకు తెలియ జేసే విధంగా ఉంది .వీరాభిమాన్లు గురించి కూడా క్లిప్పింగ్స్ ఇచ్చారు .రెండవ ఎపిసోడ్ కూడా చూస్తే గాని అభిమాన తార అభిమానులకు ఏం చెబుతారో వేచిచూడవలసిందే .

యంగ్ టైగర్ ఎన్ టి ఆర్ కు పునర్ జన్మ నిచ్చింది .........?

యంగ్ టైగర్ ఎన్ టి ఆర్ కు పునర్ జన్మ నిచ్చింది .........? ప్రణీత ...ఎన్ టి ఆర్ కు కాబోయే శ్రీమతి ...ఇది స్వయంగా చెప్పింది ఆయనే ...గత అసెంబ్లీ ఎన్నికల్లో టి డి పి తరుపున ప్రాసారం చేస్తున్న సందర్బం లో మార్చి ఇరవై ఆరవ తేదిన కారు ప్రమాదానికి గురయిన సంగతి తెలిసిందే .ఇది మళ్ళి తనకు పునర్ జన్మ అని ఎన్ టి ఆర్ చెప్పారు ..కాగ పెళ్లి చూపులు తర్వాత ప్రణీత పుట్టిన తేది చెప్పగానే ఎన్ టి ఆర్ నిర్ఘాంత పోయారట .ఈ తేది .తన జీవితం లోకి వస్తున్న ప్రణీత పుట్టిన రోజునే తనకు పునర్ జన్మ రావడం ..విశేషమే .ఏది ఏమైనా ఎన్ టి ఆర్ కు ఆమెకు మధ్య మంచి దాంపత్య జీవితం ఉండాలని ఆశిద్దాం .(పెళ్లి చూపుల్లో ప్రణీత సిగ్గుపదలేదని తానె సిగ్గు పడ్డానని ఎన్ టి ఆర్ చెప్పారు )

పాంట్ తడిస్సి పోద్ది .

మధ్యకు సమలేఖనం

29, మార్చి 2011, మంగళవారం

ఆ మాజీ ముఖ్యమంత్రి ఎవరు ?కేంద్రం బయట పెట్ట గలదా ?

ఒకే వార్త రెండు రెండు రకాలుగా ప్రసారం కావడం గమనార్హం .హవాల బ్రోకర్ "హసన్ అలీ " చెప్పిన గుట్టు మాటలకు సంబంధించి మాజీ ముఖ్య మంత్రి ప్రస్తావన వచ్చింది .అయితే ఆయన ఎవరు ? అన్నదే ప్రశ్న. మాజీ ఇంకెవరో కాదు అంటూ సాక్షి "చంద్ర బాబు " అని తెల్సేసింది .రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో మాజీ సి ఎం విదేశాల్లో దాసిన రెండు వందల కోట్లు కూడబెట్టారని ... డబ్బును తానె హ్యాండిల్ చేసినట్టు అలీ చెప్పినట్టు సాక్షి కథనం . పత్రికలో అలీ ..బాబు "నల్ల " గుర్రం అంటూ మొదటి పేజి లో కథనం వచ్చింది .సరిగ్గా తెలుగు దేశం ఆవిర్భావ దినోత్సవం రోజునే కథనం రావడం విశేషం .
కాగ మాజీ ముఖ్య మంత్రి వై ఎస్ రాజశేఖర రెడ్డి అని చంద్ర బాబు నాయుడు స్వయంగా ఈరోజు ప్రకటన్ చేసారు .సాక్షి వి బూటకపు కథనాలు అని మండి పడ్డారు.బాబు వ్యాఖ్యలు ఆయన చానల్ స్టూడియో -ఎన్ లో ప్రముఖంగా వస్తున్నై .హాసన్ అలీ ని అరెస్ట్ చేయమని తానె చెప్పానని ...విదేశాల్లో ధనం బయటకు తీసుకురావాలని పోరాడు తున్నానని చంద్ర బాబు చెబుతున్నారు ..ఇంతకి మాజీ సి ఎం ఎవరు ? మనకు నచ్చినట్టు మల్చుకోవడమేనా? అసలు నిజం తెలియాలంటే కేంద్రం తెలియ జేయాలి . సాహసం కేంద్రం చెయ్యగలదా?

కొట్టుకున్నారని ...ఎక్కువ మార్కులు వస్తాయని ...

టీచర్ -ఏరా రాము !శాసన సభ విధులు రాయమంటే ..కొట్టుకోవడం తిట్టుకోవడం రాశావ్ ..ఏం ఒళ్ళు ఎలా ఉంది ?
రాము -మీరు ప్రశ్న ఇస్తానని నిన్న మీరు చెప్పారుగా ..భాగా రాద్దామని నిన్న రాత్రి ఇంటి కెళ్ళి టి వి లో అసెంబ్లీ చూసామంత్రి ఏం ఎల్ లు భేలే బోలె కొట్టుకున్నారు సార్ ...మీరు చెప్పిన లెస్సన్ లో ఇవి లేవు .అందుకనే మార్కులు యెక్కవస్తాయని అలా రాసాను సార్ .
..

28, మార్చి 2011, సోమవారం

ఎన్ టి ఆర్ "శక్తి " కథ విశేషాలు ...

జూనియర్ ఎన్ టి ఆర్ నట జీవితాన్ని తాజా సినిమా "శక్తి " వంతం చేయనుందా?అభిమానులకు అవుననే అనిపిస్తుంది .వచ్చేనెల మొదటి తేదిన విడులవుతున్న చిత్రానికి సంబదించి కొన్ని ఆసక్తికర విశేషాలు వెలుగు లోకి వచ్చాయి .సినిమా కథ తయారి లో నిర్మాత అశ్వనిదత్ ,ఎన్ టి ఆర్ చాలా జాగర్తలు తీసుకున్నారు .బృందావనం సినిమా షూటింగ్ సమయం లోనే దర్శకుడు మెహర్ రమేష్ "శక్తి " కథ వినిపించాడు .అయెతే రెండు సార్లు చెప్పినా....ఎన్ టి ఆర్ సరిగా నచ్చలేదట .తర్వాత రమేష్ కథ పట్టుకుని నెలన్నర తరవాత వచ్చాడు .దత్ గారి ఇంట్లో సిట్టింగ్ ..యండమూరి వీరేంద్ర నాద్,సత్య నంద సమక్షం లో చర్చలు ..మొత్తానికి కథ ఎన్ టి ఆర్ కి బాగా నచ్చినట్లు చెప్పాడు .దీని కోసం మెహర్ పాత సినిమాలోని క్లిప్పింగ్స్ కూడా చూపించడం విశేషం .చిత్ర కథ ప్రకారం మానవుణ్ణి దైవం కాపాడుతుందని ...అలేగే ..భగవంతునికి సంరక్షకుడి గా మనిషి ఉంటారన్నది కథ లో ప్రదాన అంశం .కథ హరిద్వార్ ..ఈజిప్ట్ చుట్టూ తిరుగు తుంది ....ఎన్ టి ఆర్ గెట్ అప్ లు చాలా బావున్నై అన్న టాక్ ఉంది .పాటలు కూడా హిట్ టాక్ వచ్చింది .ఎన్ టి ఆర్ "ప్రేమ దేశం " పాట భాగ నచ్చిందట .కాగ పాత్రలు చెయ్యడానికి తన తాత మహా శక్తి కారణం అని ఎన్ టి ఆర్ అంటున్నారు .సినిమా హిట్ కావాలని .....ఎన్ టి ఆర్ పెళ్లి కి ఇది గిఫ్ట్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు .

సుమ తో పోటి పడలేక పోయిన రోజా ????

రోజా యాంకర్ అవతారం ఎత్తారు. మా టి లో "మోడరన్ మహలక్ష్మి " పేరుతో షో తో పూర్తి యాంకర్ గా మారిపోయారు .తొలి ఎపిసోడ్ ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంబమై రెండు గంటలకు ముగిసింది .మొదటి ఎపిసోడ్ కు బుల్లి తెర నటీమనులను తీసుకొచ్చారు .రావిత్రేయిని .కీర్తి ,శ్రీ విద్య ,శ్రీవాణి లతో షో నడిపించారు .ఐదు రౌండ్ల గేమ్ షో ఇది .మొదటి రౌండ్ లో ఒక నిమిషంలో ఇచ్చిన టాపిక్ ఇంగ్లీష్ లేకుండా పూర్తి తెలుగులో మాట్లాడుట .రెండవ రౌండ్ లో "చలా'కీ ' చంద్రముఖి "లో నాలుగు పెట్టెల తాళాలు తీయుట .మూడవ రౌండ్ లో " రా " బాణాలతో సెలిబ్రిటి ఫోటో సెలెక్ట్ చేసి మూడు ప్రశ్నలకు సమాధానాలు చెప్పుట .నాలగవ రౌండ్ లో "రింగ్ రింగా " లో లక్కి నంబర్ తో అదృష్టం పరీక్షించుకోవడం .ఆఖరి రౌండ్లో "బంగారం -సింగారం " లో నగలు అలంకరన్ చేయుట .......
ఈరోజు ఎపిసోడ్ పరిశీలిస్తే ప్రోగ్రాం సాధారణ స్థాయిలోనే ఉంది .ఫోటో సెలెక్టింగ్ ,బంగారం అలంకరన్ బావున్నై .సుమ నిర్వహించే టి వి "స్టార్ మహిళ" తో పోలిస్తే కొన్ని కాన్సెప్ట్ బాగానే ఉన్నా...సుమ తో రోజా అసలు పోటి పడలేక పోయిందని చెప్పవచ్చు .గొంతు ,మాట తీరు ,నవ్వింపు ,కవ్వింపు ..చలాకీతనం ..చిలిపితనం ..అంతకు మించి సందర్భాను చతురత విషయంలో "సుమ "కే మహిళలు ఎక్కువ మార్కులు వేస్తారు .....సరిగ్గా "స్టార్ మహిళ " సమయంలోనే పోటి అన్నట్టు రోజా ""మోడరన్ మహలక్ష్మి " ప్రసారం చేస్తున్నారు .అయితే రేటింగ్ లో పోటి పడలేరోమో ..మరి ముందు ముందు రోజా ఎలా రానిస్తుందో వేచి చూడాలి

27, మార్చి 2011, ఆదివారం

సినిమా కథకు అప్పుడు ఒకే ఒక రచయత ...ఇప్పుడు పది మంది -పరుచూరి బ్రదర్స్

సినిమా కథకు అప్పుడు ఒకే ఒక రచయత ...ఇప్పుడు పది మంది "" ఇది అన్నది అక్షరాల పరిచూరి బ్రదర్స్ .నేటి సినిపరిశ్రమ పై వారు ఒక విధంగా అసంతృప్తి వ్యక్తం చేసినట్లే .ఎన్ టి ఆర్ , ఎన్ ఆర్ సినిమాను ఏలుతున్న కాలంలో ఒకరచయత పై నిర్మాత ,దర్శకుడు ,హీరో లకు ఎంతో నమ్మకం ఉండేదని .....నేడు అది కొరవడిందని చెప్పారు వెంక టేశ్వరరావు ,గోపాల కృష్ణ .మహా నటుడు ఎన్ టి ఆర్ ...కృష్ణ వంటి వారు కావాలం పది నిమిషాల నుంచి అరగంటే లోపే కథ నువినే వారని ...తగిన ఏకాగ్రత తో వినేవారని ...చెబుతూ ..నేటి హీరోలు రెండు ..మూడు గంటలు తీసుకుంటున్నారని కుర్రాళ్ళ తీరును ఎండగట్టారు . రోజుల్లో ఏడాదికి పది సినిమాలు చేసేవారని .ఇప్పుడు ఒక సినిమా పూర్తి చెయ్యడమే గగనంఅంటున్నారు .సినిమాకు కథే బలం అని వారు ఘంటాపథం గా చెబుతున్నారు .నిజమే మరి .కేవలం హీరో ఇజంనమ్ముకునే అంతే సంగతులు .

ఒకే ఓవర్ లో ఏబై పరుగులు ?????


ఇది ఓ కల లో సరదా..రూల్స్ పట్టించుకోకండు

26, మార్చి 2011, శనివారం

ఎన్ టి ఆర్ తోనే "అభిమాని " ఆరంభం

వచ్చే మంగళ వారం నుంచి టి వి లో "అభిమాని " రీయాల్టి షో ప్రారంభ మవుతోంది .యాంకర్ రాజీవ్ కనకాల .తన బెస్ట్ఫ్రెండ్ ఎన్ టి ఆర్ తోనే తొలి ఎపిసోడ్ మొదలు పెడుతున్నాడు .వచ్చుచున్న ప్రోమో ను బట్టి ఎస్ ఎం ఎస్ ద్వారా తమఅభిమాన తారలతో సరదాగా గేమ్ ఆడించ నున్నాడు .యంగ్ హీరో తో మొదలవుతోంది కాబట్టి .. కార్యక్రమానికి మంచిరేటింగ్ వస్తుందని అంచనా .... గేమ్ హిట్ అయితే తన భార్య సుమ మాదిరి రాజీవ్ కూడా బుల్లి తెర పై మంచి పేరుతెచ్చుకోవచ్చు .రాజీవ్ కు ఆల్ ది బెస్ట్ .

25, మార్చి 2011, శుక్రవారం

ఇక లేడి రోబో లతో రొమాన్సు చెయ్యచ్చు

" నాటి కుర్రాలకే ఇది యెగిరి గంతేసే విషయమే మరి ". శృంగార రోబో లు వచ్చేస్తున్నై .కుర్రాళ్ళ ముద్దు ముచ్చట తీర్చడానికి ఇవి రడీ గా ఉన్నాయి .యూరప్ శాస్త్రవేత్తలు సెక్సీ రోబోలు తయారో చేసారట .మనిషి స్పందనలు జోడించి మరి తయారు చేసారట .రజని రోబో సినిమాలో రోబో హీరొయిన్ వెంట పడుతుంది.పెళ్లి చేసుకుంటానంది ..కాని మన కుర్రాళ్ళు లేడి రోబోల వెంట పడాలి .ఇనుములో హృదయం మోలిచేనాను అంది పాడు కోవచ్చు .తాజా రోబోలు మగవాడికి కావలసినంత సుఖం .......ముద్దులు కోరి కోరి ఇచ్చేస్తాయి .......
పెళ్లి కాని ప్రసాదులు.....పెళ్ళాం తరిమేసిన మగాళ్ళు లేడి రోబో లను కొన్నుకున్ని కోరికలు తీర్చుకోవచ్చు ...సంసారం వరకు ఓకే ....పిల్లలు కూడా రోబోలు కంటే ..ప్రపంచంలో మహిళలు అవసరం ఉండదన్న మాట .ఆడాళ్ళు !జాగరత్త

ముఖ్యమంత్రి గారికి కారే లేదు గా

ఆఫీసర్ - పెద్ద బిల్డింగ్ లో ఉంటున్నారు .....అద్దె ఇంట్లో ఉన్నానని రాస్తే ఎవరైనా నమ్ముతారా?
పారిశ్రామిక వేత్త -భలే వారే .తమిళనాడు ముఖ్యమంత్రి గారికి కారే లేదు ......

సుమ భర్త "అభిమాని " ??

రాజీవ్ కనకాల .....సుమ భర్త ...అంతకు మించి జూనియర్ ఎన్ టి ఆర్ కు మంచి మిత్రుడు .సినిమాల్లో చిన్న వేసాలతో సంతృప్తి పొందే రాజీవ్ కు మంచి బ్రేక్ లేదు .మరో వైపు భార్య సుమ మాత్రం బుల్లి తెర పై తిరుగులేని రాని అయ్యింది .సినిమాల్లో చిన్ని వేషాలే వస్తు ఉండడంతో రాజీవ్ సుమ బాట లోనే ప్రయాణం మొదలు పెట్టాడు .తానూ యాంకర్ గా అవతారం ఎత్తుతున్నాడు ."అభిమాని " పేరు తో ఈ టి వి లో సరికొత్త రియాల్టి షో రూపొందింది .దీనిలో తమకు నచ్చిన తారలతో గేం ఆడుకునే విధంగా రూపకల్పన చేసారు .కత్తి లాంటి గేం షో తో రాజీవ్ కు మంచి పేరు వస్తుందని అంటున్నారు (.ఒక వైపు మంచు ప్రసన్న "ప్రేమ తో మీ లక్ష్మి " పేరు తో షో చేస్తోంది ).అభిమాని ప్రోమో గత మంగళ వారం విడుదల చేసారు .ఎన్ టి ఆర్ కొబ్బరి కాయ కొట్టి పూజలు చేసారు .షో కోసం ప్రత్ఏక పాట ట్యూన్ చేసారు .రామజోగయ్య శాస్త్రి పాట రాసారు .ఈ షో తో రాజీవ్ బుల్లి తెర లో రాణిస్తాడని ఆశిద్దాం .

24, మార్చి 2011, గురువారం

కూల్ గా ఆడినా "పాంటింగ్ " నుంచి నేర్చుకోవాలి ...విజయం మనదే


ఈరోజు భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్నా క్రికెట్ ఆట లో రికీ పాంటింగ్ ఆట తీరు చూస్తే ఎవ్వరికైనా ముచ్చటేస్తుంది .ప్రతిష్టాత్మక పోటిలో పాంటింగ్ ఎంతో భాద్యత యుతంగా ఆడడం గమనిచ్చావచ్చు .దాదాపు చిట్టచివరివరకు క్రీజ్లో నిలబడి సెంచరీ చేసి తమ జట్టుకు మంచి స్కోర్ చేసాడు .భారత్ బౌలింగ్ ను తన సహచరులు సమర్ధవంతంగా ఎదుర్కునేల ప్రోత్సహించడమే కాదు ....బాటింగ్ చెయ్యడానికి ప్రతిసారి అవకాసం కలిపించాడు .మ్యాచ్ చూసే వారికి పాంటింగ్ స్లో గా ఆడినట్లు కనిపించిన అవకాసం దొరికినప్పుడల్లా చిత్తకొట్టి తన పవర్ చూపించాడు ..కూలగా ఆడుతూనే జట్టు స్కోరు తగిన విధంగా పెంచాడు .సారధిగా పాంటింగ్ ఆట తీరు భావుంది .పాంటింగ్ నుంచి మన వాళ్ళు చాల నేర్చుకోవాలి ...విజయం మనదే

23, మార్చి 2011, బుధవారం

జగన్ వర్గం వల్ల టి డి పి కి మేలు జరిగినట్లు......


కాంగ్రెస్ కస్టాలు మొదలయ్యా ? అంటే ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తుంది .తాజా ఎం ఎల్ సి ఎన్నికల్లో టి డి పి కి మూడు ,కాంగ్రెస్ కు మూడు ,జగన్ వర్గానికి మూడు సీట్లు వచ్చాయి. వాస్తవ ద్రుష్టి తో పరిశీలిస్తే జగన్ వర్గం వల్ల టి డి పి కి మేలు జరిగినట్లు కనిపిస్తోంది .సొంత్ జిల్లా చిత్తూర్ లో కాంగ్రెస్ వోడిపోవడం సి ఎం కిరణ్ కు ఇబ్బందే . పార్టి లో విభేదాలు అనతపురంలో వోటమికి దారి తీసాయి.జే సి కసి తీర్చు కున్నార ని అంటున్నారు .తూర్పు గోదావరి లో తగినంత బలం ఉన్న కాంగ్రెస్ గెలవలేదు .జగన్ వర్గ అభ్యర్ధి ప్రభావం తో అక్కడ టి డి పి గెలిచింది .పాపం ఫెయిర్ బాండ్ అని చెప్పుకునే గంగ భవాని కి కన్నీలే మిగిలాయి .(పోలింగ్ ముగియ గానే ఆమె గెల్చినంతగా డాన్సు కూడా చేసింది ...)....అయితే ఒక విషయం మాత్రం వాస్తవం .అది డబ్బు .అన్ని పార్టీల వారు కోట్లు కుమ్మరించార్ .....ప్రజా ప్రతినిధులు చాల మంది అమ్మడు పోయారు

22, మార్చి 2011, మంగళవారం

నిన్న కొమరబీం ...నేడు తీన్ మార్ ..కష్టాల్లో పవన్ కళ్యాణ్


పాపం పవన్ కళ్యాణ్ కు మళ్ళి సినిమా కస్టాలు మొదలయ్యాయి .కొత్త చిత్రం " తీన్ మార్ " వివాదాల్లో పడింది .ఆ టైటిల్ వాడకూదంటు తెలంగాణ లో నిరసన వచ్చింది .తీన్ మార్ ఒక సామాజిక వర్ఘనికి చెందినా గుర్తింపు పదం అని "డప్పు " అర్ధం వచ్చే ఆ పదం హక్కులు మాకే ఉన్నాయ్ అంటున్నారు నిరసన కారులు .కొమరం పులి విషయంలోనూ అలాగే జరిగింది ...కాగా టైటిల్ ప్రకటించి చాల రోజులు అవుతున్న మాట్లాడని వారు నిన్న ఆడియో ఫన్క్షన్ అవగానే విహడం సృష్టించడం పట్ల పవన్ అభిమానులు ఆందోళన చేడుతున్నారు

ఆ సినిమా ఇప్పుడు తియ్యాలంటే రెండు వందల కోట్లు -హీరో కృష్ణ (సింహాసన్ లో ఎన్ని విశేషాలు )...కృష్ణకు "బాలు పాట పాడలేదు ?????


" ఈ సినిమా ఇప్పుడు మళ్ళి తియ్యాలంటే రెండు వందల కోట్లు అవ్వవచ్చు .మహేష్ బాబు తో దీనిని రీమేక్ చేసే ఉద్దేశ్యం లేదు " సూపర్ స్టార్ కృష్ణ చెప్పిన మాటలివి ."సింహ సనం " విడుదలై ఇరవై అయిదు సంవత్సరాలు అయిన సందర్బం గా కృష్ణ తన సంతోషాన్ని తెలిపారు .నిజం తెలుగు సిని పరిశ్రమ లో ఆ సినిమా సంచలనం .డైనమిక్ ,డేరింగ్ పదాలకు కృష్ణ తార్కాణం సింహాసనం .ఈ సినిమా లో అన్ని విశేషాలే .

-తెలుగు లో తొలి సివెంటీ ఎం ఎం చిత్రం

-తొలి స్టీరియో ఫోనిక్ సౌండ్

-అత్యదిక బడ్జెట్ (కోటి ఇరవై లక్షలు )

-హిందీ లో రామ్ తేరి గంగ మిరి తర్వాత నటించిన మందాకినీ తెలుగు చిత్రం

-కృష్ణ తొలి దర్శకత్వం (కథ కూర్పు కూడా ఆయెనే )

-అత్యధిక ప్రింట్స్ (నూట యాబై )

-తెలుగు లో బప్పిలహరి తొలి సంగీతం

-రాజధాని లో నాలుగు ఆటలతో తొలి వందరోజులు సినిమా

-విజయవాడ లో ఒకే వారం అత్యధిక కలక్షన్ (ఎనిమిది లక్షలు )

-హిందీ లోను సింహాసన్ పేరు తో విడుదల (హీరో జితేంద్ర )

-వంద రోజుల పండుగకు వేలాదిమంది హాజరు

-"ఆకాశం లో ఒక తార ,.....వంటి బంపర్ హిట్ పాటలను సుశీల తో కల్పి పాడింది మాత్రం మన గాన గంధర్వుడు

ఎస్ పి బాలు కాదు ....రాజ్ సీతారాం ( ఎందుకో బాలుకు కృష్ణ మధ్య భేదాలు వచ్చాయి .కృష్ణ బాలుకు బదులుగా నూనూగు మీసాల కుర్రాడు రాజ్ సీతారం ను సింగర్ గా సెలెక్ట్ చేసాడు .అతని గాత్రం కృష్ణకు సరిగ్గా సరిపోవడం ..ఒక సినిమా తోనే మంచి పేరు వచ్చింది .తర్వాత కొన్ని చిత్రాలకు పాడాడు .గొడవలు సద్దుమణిగి మళ్ళి బాలు కృష్ణకు పాడడం మొదలు పెట్టిన తరవాత ఓ కుర్రాడు మాటు మాయం కావడం ..ఓ సిని మాయ గా చెప్పుకోవచ్చు

సుమ తో రోజా పోటి కి రడీ


బుల్లి తెర సూపర్ స్టార్ "సుమ " కు పోటిగా నటి రోజా రంగంలోకి దిగుతున్నారు .మా టి వి ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి "మోడరన్ మహాలక్ష్మి " పేరు తో కొత్త ప్రోగ్రాం మొదలుపెడుతోంది .దీనికి యాంకర్ గా "రోజా " వ్యహరిస్తున్నారు .మా టి వి లో దీనికి సంబందించిన ప్రోమో లు పరిశీలిస్తే ఈ టి వి లో సుమ "స్టార్ మహిళ" మాదిరిగా ప్రోగ్రాం ఉన్నట్లు కనిపిస్తోంది .మహిళ ప్రేక్షకుల మన్ననలు పొందుతున్న స్టార్ మహిళ కు దీటిగా దీనిని రూపొందించినట్లు తెలుస్తోంది .మోడరన్ మహలక్ష్మి కార్యక్రమాన్ని అటు మా టి వి ఇటు రోజా కూడా చాల సీరియస్ గా తీసుకున్నారు .ప్రత్యేక బాష ,యాష తో రోజా మాట్లాడించడం తో పాటు డాన్సు వంటి వాటితో ప్రేక్షకులను అలరిస్తారని చెబుతున్నారు .ఏ సమయంలో ప్రసారం చేస్తారో ఇంకా తెలప లేదు .ఒక వేళ ఈ టి వి స్టార్ మహిళ టీం లోనే అయితే నిజంగా సుమ తో రోజా పోటిపడినట్లే

ఓ లకారం కిట్టింది లే

రాము -ఏంట్రా వాళ్ళావిడ ఎప్పుడు మంచి చీర కట్టుకున్నట్టు లేదు ...నిన్నటి న్సుంచి ఓ స్టైల్ మారింది
సోము -అదా నీకు తెలియదు కాదు ...వాళ్ళాయన ఎం పి టి సి లే ...ఎం ఎల్సి ఎన్నికల్లో ...ఓ లకారం కిట్టింది

21, మార్చి 2011, సోమవారం

ఆ ఫంక్షన్ సాక్షిగా ..ఆ ముగ్గురు హీరొయిన్ ల ఎపైర్ ల ......

బాలిహుడ్ ముద్దుగుమ్మలు కరీనా కపూర్ ,కత్రిన కపూర్, దీపిక పడుకునే పై వచ్చే ఎపైర్లను మన టాలిహుడ్ తారలు భాగానే ఎంజాయ్ చేస్త్రన్నుకుంటా .మిస్టర్ ఫెర్ఫెక్ట్ ఆడియో విడుదల ఫంక్సన్ లో నల్ల శ్రీను చేసిన కామీడిలో పై ముగ్గురి తారమనుల ఎపైర్లతో నడిచింది "".సినిమాలో మొదట కరీనా కపూర్ ని తీసుకుందామని అనుకున్నాం ..ఆమె తో పాటు సైఫ్ఖాన్ వచ్చేస్తాడు .అయన హోటల్ బిల్లులు మనేమే చెల్లించాలి .కత్తి లాంటి కత్రిన ను తీసుకుంటే సల్మాన్ ఖాన్ మాటిమాటికి ఎంతరై షూటింగ్ చేసుకోనివ్వాడు ..దీపిక పడుకునే ను తీసుకుంటే రణభీర్ ....ఆ భీరు ,మాలవ్యా లాంటి వాళ్ళు వస్తారు .అందుకే డార్లింగ్ కాజల్ ను తీసుకున్నాం ." "అనేసరికి అక్కడున్న హీరో లు డైరెక్టర్లు ..అంతే భలే ఎంజాయ్ చేసారు .

19, మార్చి 2011, శనివారం

"కొండవీటి రాజ -కోటలో రాణి "తో తెలుగుదనానికి తూట్లు


సినిమా కంటే ఈనాడు బుల్లి తెర మనల్ని ప్రభావితం చేస్తోంది .అయితే మన తెలుగు సంప్రదాయాలు మరచి వస్తున్న టి వి షో లు ఆందోళన కల్గిస్తున్నై .ఈ మధ్య జీ టి లో "కొండవీటి రాజ -కోటలో రాణి పేరుతో షో నడుస్తోంది .పది యువ జంటలతో నిర్వ హిన్స్తున్న ఈ షో అసలు ఎందుకు నిర్వహిస్తున్నారో తెలియదు .అటవీ ప్రాంత యువకులను ..పట్టణ ప్రాంత యువతులను ఓ బిల్డింగ్ లో ఉంచి కార్యక్రమ నిర్హన చేస్తున్నారు .ఆడపిల్ల -మగ పిల్లోడి మధ్య యేవో గేమ్స్ పెట్టడం ..పజ్జిల్స్ పెట్టడం ..అసలు తెలుగు నేటివిటి కి ఏ మాత్రం సంబంధం లేకుండా ఉంది ...పైగా సేవలు చేసిన తీరు లో అలకలు ..తిట్టుకోవడం ...బతిమాలడాలు...అంత పిచ్చిగా ఉంది ....."సరిగమ పా " వంటి మంచి కార్యక్రమాలు అందించి తెలుగువారి అభిమానం అందుకుంటున్న జీ వారు "తెలుగుదనం లేని " కార్యక్రమాల గురించి పునరాలోచించాలి .

18, మార్చి 2011, శుక్రవారం

నువ్వు మేనమామవే కదా ..అక్కడికి ...


రాము - ఏంట్రా చిన్న పిల్ల వాడిని అలా ఏడిపిస్తున్నారు .ప్రోద్దుటనుంచి చూస్తున్న ..అసలు మీరు తల్లి దండ్రులే ?

రవి -అసలు వాడు ఏమి అడుగుతోన్నాడో తెల్సా ?

రాము -ఏమి అడుగుతున్నదేమిటి ?

రవి -రేపు చంద్రుడు వచ్చినపుడు మన ఊరు మునిగిపోద్ది....బూమ్మిధ కాకుండా వేరే గ్రహం మీదకు తీసుకువేల్లలాట..ఏం?నువ్వు మేనమామవే కధా తీసుకు వేల్తవేంటి

13, మార్చి 2011, ఆదివారం

యువ సామ్రాట్ నాగార్జున కు అసలు నచ్చనిది

యువ సామ్రాట్ నాగార్జున కు అసలు నచ్చని అంశం ఒకటి ఉంది ...అది "అవినీతి ". హీరోగా అయన సినిమాలు చేస్తూనే మంచి బిజినెస్ మాన్ గా కూడా రాణిస్తున్నారు .అయితే సినిమా పరిశ్రమలో కంటే బయట అవినీతి కనిపించిందని నాగ్ స్వయంగా చెప్పారు .పలు పనుల కోసం అయన వివిధ ఆఫీసులకు వెళ్ళినప్పుడు నాగ్ కు "లంచావతారులు " కనిపించి ఉంటారు . ఇంకేం బహుశా అవినీతి గురించి "టాగూర్ " లాంటి సినిమా నాగ్ చేసే అవకాసం ఉంది

12, మార్చి 2011, శనివారం

తన తండ్రి అమలు చేసిన సంక్షేమ పథకాలే జగన్ "వై ఎస్ ఆర్ కాంగ్రెస్స్ "పార్టి అ "జెండా "


తన తండ్రి అమలు చేసిన సంక్షేమ పథకాలే జగన్ "వై ఎస్ ఆర్ కాంగ్రెస్స్ "పార్టి అజెండా గా కనిపిస్తోంది .ఈ రోజు ఇడుపులా పాయ లో వై ఎస్ ఆర్ సమాధి దగ్గర ఆయన భార్య విజయలక్ష్మి విడుదల చేసిన మూడు రంగుల జెండా అదే విషయాన్ని తెలియజేస్తోంది .నీలం ,తెలుపు ,ఆకుపచ్చ రంగుల మంధ్య వై ఎస్ ఆర్ ఫోటో ఉంది .చుట్టూ నూట ఎనిమిది ,నూట నాలుగు ,ఉచిత విధ్యుత్ ,పావలా వడ్డీ ,ఆరోగ్య శ్రీ ,ఫీజు చెల్లింపు ,జల యంజ్నం వంటివి ఉన్నాయి .దీనిని బట్టి ఆ పథకాలు ఖచ్చితంగా అమలు చేస్తా మని చెప్పడం ...అలాగే పెండింగ్ లో ఉన్నబియ్యం -కరెంట్ సమస్యలు చేర్చవచ్చు

జగ్గం పేట లో జగన్ తన పార్టి పేరు ప్రకటిస్తా రని ఎవ్వరు చెప్పారు ?


జగ్గం పేట లో జగన్ తన పార్టి పేరు ప్రకటిస్తా రని మన మెట్టసీమలో ముందే చెప్పడం జరిగింది

" తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్లుగా..విగ్రహాలు ద్వంసం చేసారు .

తెలుగు వారి సంస్కృతికి ప్రతిబింబాలైన టేంక్ బండ పై విగ్రహాలు పథకం ప్రకారం కూల్చి వేసారు అన్న వార్తలు చూస్తుంటే "నిజంగా తెలుగు గడ్డ పై పుట్టిన తెలుగు వాడికి " ఎవ్వరికైనా మనసు కొల్లోలం కాక తప్పదు...తెలుగు వారిలో కూడా ఇంత హీనమైన బుద్దులు ఉంటాయా ? అని అనిపించక మానదు ." చిన్న తనం నుంచి తెలుగు వారు అందరు కూడా ఆ మహాత్ముల ప్రవచనాలు విన్నవారే .బడి లో ఆనందం గా రుచి చూసిన వారే ..పారాయణం చేసినవారే .అంతకు మించి మనం ఇప్పుడు చూపే "కళారూపాలకు " ప్రాణం పోసిన వారే ....పాడే పాటలో ...ఆడే ఆటలో ...మనకు ఉపాధి దొరకడానికి అవసరమైన జ్ఞానం వారు ఇచ్చిందే .ఇవ్వన్ని మర్చి పోయి " తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్లుగా..విగ్రహాలు ద్వంసం చేసారు ." కొందరి స్వార్ధ పూరిత నేతల మాయ మాటలకు మోసపోయి చెడ్డపని చేసి తెలుగు వారి మధ్య మరింత అంతరాన్ని సృస్తించారు . ద్వంసం కేసు లో ఉన్న ప్రతి ఒక్కరిని కటినంగా శిక్షించాలి .ప్రోత్సహించిన పెద్దల పని పట్టాలి .

జగన్ జగ్గంపేట లోనే తన పార్టి ప్రకటన చేయడం వెనుక ??...అక్కడ భోజనం చేస్తే సి ఎం !


జగన్ జగ్గంపేట లోనే తన పార్టి ప్రకటన చేయడం వెనుక చాల కసరత్ జరిగింది .ఎన్నికల కోడ్ దృష్ట్యా జగ్గంపేట సభ నే పార్టి సభ గా మార్చలనుకున్నారు .అయితే ముహూర్తాలు కుదరలేదు .ముహుర్తాలపై జగన్ కు పెద్ద పట్టింపు లేకున్నా తనకు సలహాలు ఇచ్చే ముఖ్య బంధువుకు ముహుర్తాలపై పట్టింపు ఉన్నట్టు తెలుస్తోంది .జగన్ జగ్గంపేట లో సభలో పాల్గునే ముందు మల్లిసాల అనే గ్రామంలో " అత్తులూరి " కుటుంబం ఇంటికి విందు కు వెళ్ళారు ( ఈ ఇంట విందు తీసుకున్న వారు మంచి ఉన్నతి లో ఉంటారన్న సెంటిమెంట్ ఉంది .గతం లో ఇక్కడ ఆతిద్యం పొంది న వై ఎస్ ఆర్ ,రోశయ్య ముఖ్యమంత్రి అయ్యారని ...అలాగే జగన్ కూడా అవుతారని నమ్మకంతో ..జ్యోతుల నెహ్రు ఇక్కడ ఏర్పాట్లు చేయించారు ) .జ్యోతుల నెహ్రు పెట్టుకున్న ముహూర్తం మించి పోతూ ఉండడంతో యాన అత్తులూరి ఇంట జగన్ పార్టి లో చేరారు .అప్పటికే జగన్ మనసులో పార్టి పేరు అధికారికంగా ప్రాకటించే ఆలోచన ఉన్న బయట పెట్ట కుండా ....జగ్గంపేట లో వేలాదిమంది మధ్య ప్రకటన చేసారు .తూర్పు సెంటిమెంట్ కూడా జగన్ కు కల్సి వచ్చింది .సాధారణంగా తూర్పు గోదావరి జిల్లలో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే ఆ పార్టీయే అధికారంలోకి వస్తుంది అన్న నమ్మకం రాజకీయ పార్టీలలో ఉంది .మొత్తం మీద కొత్త పార్టి తూర్పున ఉదయించి నట్లయంది

9, మార్చి 2011, బుధవారం

ఏబై వేలు నుంచి డబ్బై వేలు ఇవ్వడానికి రడీ !

ఏం పి టి సి లకు రాజయోగం కలగనుంది . నిజమే మరి .ప్రస్తుతం వస్తున్న వార్తలను బట్టి వారిదే ఛాన్స్ .సాధారణంగా వారికి పెద్దగా ప్రాధాన్యం దక్కదు .మండల మీటింగుల సమయంలో తప్ప చాల చోట్ల వీరికి గుర్తింపు తక్కువే .రాజకీయంగా బలం గల వారిని మినహాయిస్తే ఆయా గ్రామాల్లో సర్పంచ్ కు ఉన్నంత ప్రదాన్యత్ వీరికి కనిపించదు ....అయితే నేడు వారు ఎక్కడ ఉన్నారో అని కాగడా పట్టి మరీ వెతుకుతున్నారు .ఏం ఎల్ సి ఎన్నికలే దీనికి కారణం .ఆ ఎన్నికల్లో వీరికి ఓటు ఉంది .దీంతో వీరిని మచ్చిక చేసుకోవడానికి పోటి పడుతున్న నేతలు వీరి వెంట పడుతున్నారు ......డబ్బులు కూడా రెడి చేస్తున్నారు అభ్యర్దులు ...ఒక ఏం పి టి సి సభ్యునికి ఏబై వేలు నుంచి డబ్బై వేలు ఇవ్వడానికి రడీ అంటున్నారు ....అది కథ .

7, మార్చి 2011, సోమవారం

జగ్గంపేట లో "జగన్ పార్టి ప్రకటన !

జగన్ పార్టి జగ్గంపేట లో లాంచ్ అవుతోందా? ప్రస్తుతం జరుగుతున్నా పరిణామాలు గమనిస్తే జరగడానికి అవకాసం ఉంది .ఈ నెల పన్నిండు న జగన్ తన ప్రాంత ఇడుపల పాయలో వై ఎస్ సాక్షిగా "పార్టి పేరు -కొన్ని విదివిదానాలు
ప్రకటించ వలసి ఉంది .అయితే ఉప ఎన్నికలు , కోడ్ వస్తే అక్కడ పార్టి ప్రకటించడానికి వీలు లేదు .(ఖర్చ్చు లు )ఈ నేపథ్యంలో ఇతర అవకాశాలు పరిశీలిస్తున్నారు . తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట లో ఈ నెల పదకొండవ తేదిన జ్యోతుల నెహ్రు జగన్ వర్గం లో కల్సే సభ జరగబోతోంది .గతంల్లో తెలుగుదేశం ,ప్రజారాజ్యం పార్టి లకు జిల్లా
అధ్యక్షడు గా పని చేసిన ఆయన చిరు కాంగ్రెస్లో చేరడం ఇష్టం లేక ....తన అభిన్మానులతో జగన్ పార్టిలో చేరుతున్నారు.నెహ్రు తన సత్తా చూపదినికి భారి బహిరంగ సభ ఏర్పాటు చేసారు .సుమారు నియోజవర్గం నుంచి అర్రవై వేలు జనం వస్తారని అంచనా .....కాగ సోమవారం జగన్ జ్యోతుల నెహ్రూను అర్జెంట గ వైజాగ్ పిలిపించుకుని ...కడపలో ఎన్నకల పరిస్తితి వివరించి ......పార్టి ప్రకటన జగ్గంపేటలో చేసే ఆలోచన చెప్పినట్టు
తెలిసింది ......జ్యోతుల ఆఘ మేగాలపై కాకినాడ వెళ్లి జగన్ వరిగీయుల్తో ఇందు కోసం కసరత చేస్తున్నారు ...
ఒక వేల జగన్ జగ్గంపేట గతం లో జగ్గంపేట లో సోనియా సభ నిర్వహించిన ప్రాంతం లోనే జ్యోతుల సభ నిర్ర్వ్హిన్స్తున్నారు .appudu naa

6, మార్చి 2011, ఆదివారం

ఏ బి ఎన్ ఆంధ్రజ్యోతి ఈరోజు ఓ మంచి పని చేసింది .


ఏ బి ఎన్ ఆంధ్రజ్యోతి ఈరోజు ఓ మంచి పని చేసింది .గతంలో ఎంతో ఘనమైన జీవితం అనుభవించి ప్రస్తుతం దారిద్ర్యంల్లో మగ్గుతున్న ఓ కళాకారుడి జీవనాన్ని వెలుగులోకి తెచ్చి అతినికి సాయపడేలా చేసింది .పి ఏ సలీం ...కొత్తగా వచ్చిన వారు తప్ప గత రెండు తరాల వారు సిని పరిశ్రమలో తెలియని వారు ఉండరు .ఆయన ప్రముఖ డాన్సు మాస్టర్ .ముగ్గురు మఖ్యమంత్రులు ( ఎన్ టి ఆర్ ,ఎం జి ఆర్ ,జయ లలితే ) తో పాటు వందలమందిని వేలాది పాటల్లో

డాన్సు చేయించిన మొనగాడు . బందువుల మోసంతో ప్రస్తుతం ఆయన చాల కష్టం గా బతుకుతున్నాదట .జబ్బు చేసి ఆపరేసన్ చేయున్చుకోవడానికి

డబ్బు లేదు .ఈ నపధ్యంలో ఏ బి ఎన్ లో వచ్చిన కథనంతో ఎంతో మంది స్పందించారు .విరాళాలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు .దర్శకుడు దాసరి

ఆపరేసన్ ఖర్చ్ తానూ భరిస్తానని ప్రకతిచారు .కోడి రామకృష్ణ తన సినిమాలో ఛాన్స్ ఇస్తామని చెప్పారు ...మొత్తం మీద ఆంధ్రజ్యోతి చేసిన ప్రయత్నం అభినందనీయం

3, మార్చి 2011, గురువారం

వామ్మో !వాణ్ని కౌగి ..............టే అత్తుక్కు పోయినట్టే

సౌమ్య - బాబోయి ! వాణ్ని పెళ్లి చేసుకుంటే అంత సంగతులు

రోజా -ఏం? అయస్కాంతం లాంటి అందగాడే

సౌమ్య -అదేనే భయం ..కౌగిలించుకుంటే ...అయ్యబాబోయి .

.ఎప్పటికి వదులుతాడో ! అసేలే నాకు ఊపిరి ఆడాడు

( సందర్బం -చాతి పై ఉంచిన వస్తువులను ఆకర్చిస్తున్న సెర్బియా దేశ బాలుడు )

"రోజా "గత జన్మలో మాంచి మగరాయుడు !! -ఈ మాట "ఆమె " స్వయంగా చెప్పింది

"""రోజా గత జన్మలో మగరాయుడు .జేమ్స్ ..రంగస్థల నటుడు ..""ఈ మాటలు రోజా చేస్తా స్వయంగా చెప్పించారు .బుధవారం రాత్రి "మా " టి వి లో గత జన్మ రహస్యం .ఈ కార్య క్రమానికి యాంకర్ సాయికుమార్ .
గత జన్మలు ఉంటాయాని ...అవి కొందరని భాదిస్తాయాని ..నిజం తెల్సుకుంటే భాధ పోయి మనసు ప్రశాంతంగా
ఉంచుకోవచ్చు అనే కాన్సెప్ట్ తో ప్రముఖ మానసిక ....హిప్న టెస్ట్ లతో రూపొందిన ఈ కార్యక్రమంలో రోజా
పాల్గున్నారు ...హిప్నాటిజం ద్వారం రోజాను గాఢ నిద్ర లోకి తీసుకుని వెళ్లి గత జన్మ లో చివరి సంఘటన
గూర్చి అడిగారు .......
గత జన్మలో తన పేరు జేమ్స్ అని స్టేజ్ ఆర్టిస్ట్ గా .చెప్పారు ప్రమాదం కారణంగా తానూ మంచు గల సరస్సు
పడిపోయానంటు ..ఆమె నిజంగానే జరిగినట్టు ఫీలింగ్ ఇచ్చారు .తోబ్బై నిమిషాలు రోజా అలానే గాఢ నిద్రలో ఫీలింగ్స్ సమాధానాలు చెప్పారు . బయటకు వచ్చిన అనంతరం ఇది తనకు థ్రిల్లింగా ఉందని గత జన్మలపై తనకు నమ్మకం ఉందని ..అందరు నమ్మకపోవచ్చునని చెప్పారు .కాగ సినిమా ఆర్టిస్ట్ గా నటించలేదు .కదా అన్న ప్రశ్న కు నిజామా గానే ఫీల్ అయ్యానని రోజా చెప్పింది .ఇదే నిజమైతే ఆమె గత జన్మలో మాంచి మగరాయుడు అన్న మాట

2, మార్చి 2011, బుధవారం

శివ రాత్రి రోజున ఏ టి ఎం కు పూజ !!!

రవి -ఇదేంట్రా శివరాత్రి పూట వీడు ఇంట్లో ఏ టి ఎం ఫోటో పెట్టి పూజ చేస్తున్నాడు ..వీడి కామిన పిచ్చా ?

రాము -వాడు పిచ్చివాడు కాదురా ...రాత్రికి రాత్రే లక్షాధికారి అయిపోయాడు ..

రవి - లక్షాధికారి ఏ టి ఎం ఏంట్రా ఇదంతా ?

రాము - రాత్రి ఏ టి ఎం కు వెళితే ...పది వేలకు బదులు పది లక్షలు పడ్డాయట ...రాత్రికి రాత్రే అప్పలు తీర్చి ..ఇలా పూజ మొదలు పెట్టాడు

అప్పటికప్పుడు పిల్లకు పెళ్లి ఏంటి ?


భార్య -అదేంటండి ..అప్పటికప్పుడు పిల్లకు పెళ్లి ఏంటి ? మీకు మతి ఉందా ?

భర్త -మతి ఉండబట్టే మాట్లుడుతున్నా ! తెలవారే వరకు ఈ డబ్బు ఉంటుందో లేదో తెలియదు ...పది లక్షలు మళ్ళి చూడలేము .బాంక్ వాళ్ళు వస్తే డబ్బు పట్టుకు పోతారు ..అర్జెంట్ గా మీ అన్నయ్యకు ఫోన్ చెయ్యి .......మొన్న చూలకు వచ్చిన అబ్బాయి వాళ్ళను నేరుగా గుడికి రమ్మను .అప్పులవాళ్ళకు ఎలాగు ఇదు లక్షలు ఇచ్చాం .మిగిలిన ఐదు పీల్లి కొడిక్కి ఇచ్చేసి కాశికి వెళ్లి పోదాం

(సందర్బం -ఏ టి ఎం లో వేలకు బదులు లక్షలు పడ్డాయి )