12, మార్చి 2011, శనివారం

" తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్లుగా..విగ్రహాలు ద్వంసం చేసారు .

తెలుగు వారి సంస్కృతికి ప్రతిబింబాలైన టేంక్ బండ పై విగ్రహాలు పథకం ప్రకారం కూల్చి వేసారు అన్న వార్తలు చూస్తుంటే "నిజంగా తెలుగు గడ్డ పై పుట్టిన తెలుగు వాడికి " ఎవ్వరికైనా మనసు కొల్లోలం కాక తప్పదు...తెలుగు వారిలో కూడా ఇంత హీనమైన బుద్దులు ఉంటాయా ? అని అనిపించక మానదు ." చిన్న తనం నుంచి తెలుగు వారు అందరు కూడా ఆ మహాత్ముల ప్రవచనాలు విన్నవారే .బడి లో ఆనందం గా రుచి చూసిన వారే ..పారాయణం చేసినవారే .అంతకు మించి మనం ఇప్పుడు చూపే "కళారూపాలకు " ప్రాణం పోసిన వారే ....పాడే పాటలో ...ఆడే ఆటలో ...మనకు ఉపాధి దొరకడానికి అవసరమైన జ్ఞానం వారు ఇచ్చిందే .ఇవ్వన్ని మర్చి పోయి " తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్లుగా..విగ్రహాలు ద్వంసం చేసారు ." కొందరి స్వార్ధ పూరిత నేతల మాయ మాటలకు మోసపోయి చెడ్డపని చేసి తెలుగు వారి మధ్య మరింత అంతరాన్ని సృస్తించారు . ద్వంసం కేసు లో ఉన్న ప్రతి ఒక్కరిని కటినంగా శిక్షించాలి .ప్రోత్సహించిన పెద్దల పని పట్టాలి .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి