21, ఫిబ్రవరి 2011, సోమవారం

పద్మ భూషణ్ అక్కినేని నాగేశ్వర్ రావు చెప్పిన పచ్చి నిజాలు

పద్మ భూషణ్ అక్కినేని నాగేశ్వర్ రావు ఈ మధ్య
ఇంటర్వ్యూ లలో కొన్ని పచ్చి నిజాలు చెప్పడం
విశేషం ."దేవాదాస్ " వంటి సినిమాల్లో హీరో గా
చేసినప్పుడు కొన్ని రోజులు భోజనం మానివేసి
మందుబాబు గా నటించానని ఎన్నో సార్లు పేపర్లో
వచ్చిందని నిజానికి ఫుల్ గా తినడం వల్లే ఆ పాత్రకు
న్యాయం చేసానని చెప్పారు ."కళ్ళు లోతుకు పోయి ,
ముఖం పీక్కు పోయి ఉన్నట్టు నా ముఖం ఉండాలి .
మీగడ తో బాగా భోజనం చేసిన తర్వాత మస్తు వచ్చేది
నాకు .అందుకే షూటింగ్ రాత్రి పూట చేసేవారం .నేను
మత్తుగా జోగుతుంటే దేవదాస్ పాత్ర కు సరి పోయేది ".
అని అసలు విషయం వెల్లడించారు . అలాగే మొదట్లో
హీరొయిన్ తో మాటల్దలంటేనే భయంగా ఉండేదని
భానుమతి వంటి సీనియర్ నటిమనులతో చనువు
పెంచడానికి నిర్మాతలు, దర్శకులు నన్ను వారితో
కార్లో తిప్పడం ,సరదాగా సెట్లో ఆటలు ఆడించడం
వంటివి చేసేవారని అక్కినేని వివరించారు .కాగ
సినిమా పరిశ్రమకు ఎన్ టి ఆర్ ,ఏ ఎన్ ఆర్ మాత్రమె
రెండు కళ్ళు అనడం తగదని ..ఇంకా చాలామంది
కళ్ళు ఉన్నాయని అన్నారు .అప్పట్లో హీరోల మధ్య
ఆరోగ్యకరమైన పోటి ఉండేదని ....అందుకే తానూ ఎన్
టి ఆర్ తో పదియేడు సినిమాల్లో నటించామని
గర్వంగా చెప్పారు .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి