21, ఫిబ్రవరి 2011, సోమవారం

వారసత్వం ..డబ్బు లేకే ..రాజకీయాల్లోకి రాలేకపోతమంటున్న విద్యార్దులు !

వారసత్వం ..డబ్బు తో ఆయా కుటుంబాల వారే
ఎదుగు తున్నారని ...తెలివి ఉన్నా రాజకీయాల్లోకి
రాలేక పోతున్నామంటున్నారు మన తెలుగు
విద్యార్దులు ."యంగ్ స్తాన్" పేరు తో ఆంధ్ర జ్యోతి
ఎం డి వి . రాధాకృష్ణ ఈరోజు నిర్వహించిన డిబేట్లో
చాల మంది తమ అభిప్రాయాలు నిక్కచ్చిగా చెప్పారు .
అక్కినేని ,చిరంజీవి ...కుటుంబాలలో వారే సినిమాల్లోకి
వారసులుగా వస్తున్నారని ....అలాగే యూత్ రాజకీయాల్లోకి
రాకపోవడానికి ప్రస్తుత స్తితి కారణమని చెప్పారు .గాంధీ
వారసులుల్గా రాహుల్ ,వై ఎస్ రాజశేఖర్ రెడ్డి వారసుడిగా
జగన్ వంటి వారే నిండి పోతున్నారని ...నేర చరిత గలవారు
చాలామంది ఉన్నారని చెప్పుకొచ్చారు .మన సంపద అంతా
రాజకీయనాయకులే దోచుకుంటున్నారని ఆవేదన
చెందారు ........." రాధా కృష్ణ మాత్రం పలుసార్లు
"ముందు సామాజిక సేవ దృక్పధం రావాలని ....
హిత బోధ చేసారు .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి