28, నవంబర్ 2010, ఆదివారం

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు రాజీనామాలు ముఖ్యమంత్రి కోరడం వెనుక ?

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు గా ఉన్న వారి రాజీనామాలు తీసుకోమని ముఖ్యమంత్రి చీఫ్ సెక్రెటరీ ని ఆదేశించడం కొత్త సి ఎం సరికొత పాలనకు శ్రీకారం చుడుతున్నట్లు కనిపిస్తోంది .క్లిష్ట కాలంలో ముఖ్యమంత్రి ముళ్ళ కిరీటాని ధరించిన కిరణ్ కుమార్ రెడ్డి తనదయన పాలన చేసేందుకు ముందుకు వెలుతున్నంట్లు కనిపించడం మంచి పరిణామమే .ఇంత వరకు జరిగిన పాలనకు సంభందించి అటు ప్రజలకు ,ఇటు పార్టికి నష్టం కల్గించే కొన్ని నిర్ణయాలు జరిగిన నేపధ్యంలో కొత్త సి ఎం ప్రజా రంజక పాలన చేసి పార్టిని గట్టు ఎక్కించే ప్రయత్నం మొదలు పెట్టినట్లు తెలుస్తోంది .ఒకే సారి ప్రభుత్వ సలహాదారుల రాజిఇనామాలు కోరడం ద్వారా ప్రభుత్వం పార దర్శకంగ్గా ఉంటుందని జనాకి సంకేతాలు ఇచ్చి నట్లయింది (కాగ కే వి పి రామచంద్ర రావు తో సహా పలువురు ఇప్పటికే రాజీనామా చేసారు )

1 కామెంట్‌:

  1. ఆరంభశూరత్వం కాకూడదు.ఇకమీదట ఢిల్లీ నగరంనుంచి కూడా సలహాదారులు దిగుమతి కారుకదా!

    రిప్లయితొలగించండి