26, డిసెంబర్ 2010, ఆదివారం

కూచిపూడి గిన్నిస్ రికార్డు లో పురందేశ్వరి కి స్థానం -రాష్ట్రపతి


కూచిపూడి నృత్య కళాకారులు ఈరోజు గిన్నీస్ రికార్డు
సాధించడం మన అందరికి గర్వ కారణం .దేశ విదేశాలకు
చెందిన రెండు వేల ఎనిమిది వందల మంది ఈ రికార్డు
సాధన లో పాలు పంచుకున్నారు .రాష్ట్రపతి చేతులు
మీదుగా సి ఎం గిన్నిస్ సర్టిఫికేట్ అందుకున్నారు .
రాష్ట్రపతి చేతులు మీదుగా గురువులు సత్కరింప
బడ్డారు .కాగా గౌరవ రాష్ట్రపతి ప్రతిబా పాటిల్ గారు
ప్రసంగిస్తూ అంకె కు ఒకటి కలపాలని అన్నారు .అది
కేంద్ర మంత్రి పురందేశ్వరి గారిది .నిన్న ఆమె నృత్యం
చేసిన సంగతిని దృష్టిలో ఉంచుకుని ఆమె ఈ మాట
అన్నారు .ఏమైనా మన తెలుగుంటి ఆడపడుచు
పురందేశ్వరి గారు కేంద్రంలో మంచి మార్కులే స్కోరు
చేస్తున్నారు .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి