28, జనవరి 2011, శుక్రవారం

జీలు ,గన్లు ,బాబు ల గుట్టు కోసం ఆ మూడు చదవాల్సి వస్తోంది

ప్రస్తుత తెలుగు పేపర్ల పోటి లేదా కయ్యం వల్ల
ఎన్నో నిజాలు బయట పడుతున్నై .ముఖ్యంగ్గా
సాక్షి, ఈనాడు ,ఆంధ్రజ్యోతి పత్రికల్లో అన్ని వార్తలు
చదివితే మన నేతల ..ప్రముఖుల జాతకాలు తెల్సి
పోతున్నై .వై ఎస్, జగన్ సామ్రాజ్యం గురిచి " రెండు "
పత్రికల్లోను ....రామోజీ -రాధాకృష్ణ లు ,చంద్రమధ్యకు సమలేఖనంబాబు గురించి సాక్షి లోను భలే రాస్తున్నారు .
అంతే కాదు ... వార్త కు మూడు పత్రికల్లో
అసలు పొంత ఉండదు .ఫోటోల విషయంలోనూ
అంతే ...జగన్ మరియు అతని జనం వారి
పత్రికల్లో పేజిలకు పేజీలు ఉంటై .అదే రోజు
ఈనాడు తిరగేస్తే ఏదో మూల చిన్న వార్త ఉంటుంది .
ఫోటో ఉండవచ్చు .ఉండక పోవచ్చు .సాక్షి లో
చంద్రబాబుకు ,నేటి ముఖ్య మంత్రి కి కూడా
జగన్ తర్వాత స్తానమే .జగన్ వర్గీయులు
చెప్పిన వివరాలు తాటికాయంత అక్షరాల
లోను ....మిగిలినవి ..ఆవగింజ మాదిరిగా
కనిపిస్తాయి .ఆంధ్రజ్యోతి ,ఈనాడు లలో ..
జగన్ పై వార్త లేకుండా ఉండదు .ఆంధ్రజ్యోతి
,ఈనాడు లు రెండు వై ఎస్ రాజశేఖర్ రెడ్డి
కుమారుడికి ఇంత దోసి పెట్టారు ..అంటూ
కళ్ళు తిరిగే వివరాలు ఇస్తారు .సాక్షి లో
పసుపు పాములు -రాజగురువు రామోజీ
పై సటైర్లు వేస్తుంది .జగన్ ఆస్తులపై
హైకోర్టు సుమోతో కేసు స్వీకరించిన
తరుణంలో రెండు పత్రికలూ తమ
వార్తలతో "జగన్ "ను ఆటలాడుకోగా
సాక్షి కాంగ్రెస్స్ టి డి పి ,రామోజీ కుమ్మక్కు
అయ్యారంటూ వార్తలు ఇస్తోంది ....
మొత్తం మీద మూడు చదివితే గాని
నిద్ర పట్టడం లేదు కొందరికి .అయితే
రాజకీయ ఆసక్తి గల వారు మూడు పత్రికలూ
కొనుగోలు చేయవలసి వస్తున్నాడని వాపోతున్నారు .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి