22, జనవరి 2011, శనివారం

గుచ్చి గుచ్చి అడిగిన రజనికాంత్ -తనకేమి తెలియదన్న శ్వేతా రెడ్డి

"సూరి వ్యవహారం లో నాకు ఏమి తెలియదు " అంటూ న్యూస్ రీడర్
శ్వేతా రెడ్డి లబో దిబో మంటోంది .టి వి నైన్ లో రాత్రి రెండు గంటల పాటు
యాంకర్ రజనికాంత్ శ్వేత ను ఇంటర్ వ్యూ చేసారు .ఎన్నో విషయాలను
గుచ్చి అడిగారు .అయితే ఆమె ఎక్కడ తడబడ కుండ సమాధానాలు చెప్పింది .
ధైర్యంగా ...గున్దేనిబ్బరంగా ఆమె ఆన్సర్ చేసింది .సూరి సమీప బందువు అని
తమ ఇంటి దగ్గర భోజనం చేసారని కూడా చెప్పింది .అయితే సూరి ని ఎప్పుడు
అంటి పెట్టుకునే ఉండే "బాను " మాత్రం ఒక్కసారి కూడా తమ ఇంటికి రాలేదంది.
తనకు సూరి ఆస్తుల వ్యవహారం లో ఎటువంటి సంబంధం లేదని .....తన పేర
ఆస్తులు ఉన్నాయన్న మాట బూటకం అని .....లేని పోనివి రాసిన ..ప్రసారం
చేసిన కొన్ని వాటిపై చర్యలుతీసుకుంటాను అంది .సూరి తనను చదువులో
ప్రోత్స హించేవారని సివిల్ రాయమని అనేవారని చెబుతూ ......సూరి వ్యవహారం తో
తను పూర్తి డిస్ట్రబ్ అయ్యానని న్యూస్ రీడర్ కు స్వస్తి చెప్పి బాగా చదువు కొందామని
అనుకుంటునట్లు ఆమె చెప్పారు .జరిగింది తన "ఖర్మ "గా శ్వేతా రెడ్డి చెప్పుకున్నారు .
ఈమె చెప్పిన మాటలు నిజమో కాదో కాలమే నిర్ణయించాలి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి