26, అక్టోబర్ 2010, మంగళవారం

పల్లె పడుసులు "సోకుల " కోసం అప్పులు చేస్తారా ?

మైక్రో రుణాలు తీసుకుని కొందరు మహిళలు సోకులు చేసినట్టు మంత్రి వసంత కుమార్ గారు వ్యాఖ్య నించినట్టు చూసి ఇది రాస్తున్నాను . గ్రామీణ మహిళలు సాధారణంగా అప్పు చేసారు అంటే దానికి తగిన కారణం ఉంటుంది .అనవసంగా వారు అప్పు చేయారు (నూటికో .కోటికో ఇలాంటి వారు అక్కడక్కడ ఉండ వచ్చు కాదనలేము ) .అన్ని సరుకులు పెరిగిపోయాయి .కుటుంబంలో అందరు కష్టపడిన కడుపారా తినలేక పోతున్నారు .అనారోగ్యం ,పిల్లల కనీస అవసరాలు తీర్చడంకి వారు మైక్రో ఉచ్చులో చిక్కుకోక తప్పడం లేదు .తగిన ఉపాది ,అందుబాటులో ధరలు ,సమర్ధవంతంగా ప్రభుత్వ పథకాలు అమలు జరిగితే ఈ దుస్థితి వచ్చేది కాదు . వీలు అయితే వారని మైక్రోమాయల నుంచి కాపాడండి అంతే కాని వార్నీ అనవసరం గా నిందించడం తగదు

2 కామెంట్‌లు:

  1. కానీ, వాళ్ళు తెలిసే అప్పు తీసుకున్నారు కదా, ఎంత వడ్డీ చెల్లించాలి - ఎన్ని వాయిదాలు చెల్లించాలి లాంటివి ముందే తెలిసే తీసుకుంటారు కదా.
    నేను విన్నదాని ప్రకారం - డైలీ ఫైనాన్స్ తో పోలిస్తే మైక్రొ రుణాల వడ్డీ రేట్లు ఎక్కువ కాదనుకుంటా - మీ అభిప్రాయాలు, మీకు తెలిసినవీ చెప్పండి.

    రిప్లయితొలగించండి
  2. ఒకసారి మీరు మైక్రోలో అప్పు చేసి చూడండి సరదాగా ...తెలుస్తుంది

    రిప్లయితొలగించండి